ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. వేసవి కాలం వచ్చినా ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీలపైనే ఉన్నా... ఉదయం ప్రకృతిని చూస్తే శీతాకాలంలా ఉంటోంది. పంట పొలాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఉదయం పొలాలకు వెళ్లే రైతులు మంచు అందాలను ఆస్వాదిస్తూ పనులు చేసుకుంటున్నారు.
కోనసీమలో కనువిందు చేస్తున్న మంచు అందాలు - కోనసీమలో కురుస్తున్న మంచు
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఉదయం పొలాలకు వెళ్లే రైతులు మంచు అందాలను ఆస్వాదిస్తూ పనులు చేసుకుంటున్నారు.
![కోనసీమలో కనువిందు చేస్తున్న మంచు అందాలు కోనసీమలో కనువిందు చేస్తున్న మంచు అందాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6810242-632-6810242-1587009739344.jpg)
the-snowy-beauty-of-konaseema