తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగినిపై అధికారి దాడి.. నిందితునిపై నిర్భయ కేసు

మాస్క్​ పెట్టుకోవాలని చెప్పినందుకు ఓ మహిళా ఉద్యోగిపై అధికారి దాడి చేశాడు. ఈ ఘటన ఏపీ నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో జరిగింది. ఘటనపై ఉద్యోగిని నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సదరు అధికారిని అరెస్ట్ చేశారు.

By

Published : Jun 30, 2020, 1:53 PM IST

the-manager-attacked-women-employee-in-nellore-ap-tourism-office
ఉద్యోగినిపై అధికారి దాడి.. నిందితునిపై నిర్భయ కేసు

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్.. చాకు​, కర్రతో దాడి చేశాడు. కరోనా నేపథ్యంలో మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు ఆగ్రహించిన మేనేజర్... ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వెళ్లగక్కాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మేనేజర్​ అరెస్టు.. సస్పెండ్​

ఉద్యోగిని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి తెగబడ్డ మేనేజర్​ భాస్కర్​ను అరెస్టు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్​ మేనేజర్​ భాస్కర్​ను సస్పెండ్​ చేశారు.

ఉద్యోగినిపై అధికారి దాడి.. నిందితునిపై నిర్భయ కేసు

భాస్కర్​పై నిర్భయ కేసు

ఏపీ టూరిజం హోటల్​ డిప్యూటీ మేనేజర్​ భాస్కర్​పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళపై దాడి చేయడం దారుణమన్న డీఎస్పీ.. ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని అన్నారు.

ఇదీ చూడండి:ప్రవేశ పరీక్షల వాయిదా పిల్‌పై హైకోర్టులో విచారణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details