జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఓటరుకూ ఓటింగ్ స్లిప్లు అందేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. రాజకీయ పార్టీలు కూడా పార్టీ గుర్తు లేకుండా ఓటరు స్లిప్పులు పంచవచ్చన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సాధారణ పరిశీలకులతో ఎస్ఈసీ పార్థసారథి సమీక్షించారు.
ఈ నెల 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితా: ఎస్ఈసీ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరుకు ఓటింగ్ స్లిప్లు అందేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి సూచించారు. ఎన్నికల్లో సాధారణ ఎన్నికల పరిశీలకుల పాత్ర అత్యంత విలువైందని.. ఒక్కో జోన్ పరిధిలోని వార్డులకు ఒక సాధారణ ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా ఈ నెల 21న ప్రకటిస్తామన్నారు.
ఎన్నికల్లో సాధారణ ఎన్నికల పరిశీలకుల పాత్ర అత్యంత విలువైందని.. ఒక్కో జోన్ పరిధిలోని వార్డులకు ఒక సాధారణ ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు పార్థసారథి వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా ఈ నెల 21న ప్రకటిస్తామని.. పరిశీలకులు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, అభ్యర్థుల ఎన్నికల వ్యయం వంటి విషయాలు పరిశీలించాలని సూచించారు. పరిశీలకులు ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పోటీ చేసే అభ్యర్థులు పారదర్శకత పాటించాలి: పార్థసారథి