Subcommittee meet on House sites: రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. ఇళ్ల స్థలాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Subcommittee meet on House sites: ' మరింత కసరత్తు చేశాకే సీఎంకు నివేదిక'
Subcommittee meet on House sites: పేదల ఇళ్ల స్థలాలు, వాటి క్రమబద్ధీకరణ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది.
కేటీఆర్
58, 59 జీఓ కింద క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం, పెండింగ్లో ఉన్న వాటిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ విషయంలో మరింత కసరత్తు చేశాక సీఎం కేసీఆర్కు నివేదిక అందించనుంది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- ఇవీ చూడండి:
- పేదలు ఆక్రమించుకున్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై చురుగ్గా కసరత్తు...
- High court on Podu lands: ఆ చట్టం ప్రకారమే దరఖాస్తులు స్వీకరించాలి: హైకోర్టు
- land regularization in telangana : సర్కార్ భూముల లెక్కలు తీస్తున్న కలెక్టర్లు
- Sub committee for houses: ఇళ్లస్థలాల సమస్యల పరిష్కారం కోసం సబ్కమిటీ ఏర్పాటు
- LRS: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వర్గీకరణపై అధికారుల కసరత్తు