తెలంగాణ

telangana

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

By

Published : Feb 4, 2020, 2:11 PM IST

లారీని ఓవర్​టేక్​ చేయబోయి... వాహనం అదుపుతప్పి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్​ అమీర్​పేట ఎక్స్​రోడ్​ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

Road_Accident
Road_Accident

హైదరాబాద్​ అమీర్​పేట్​ ఎక్స్​రోడ్​ వద్ద లారీని ఓవర్​టేక్​ చేయబోగా వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో... వాహన చోదకుడు ఆసిఫ్​కు గాయాలవగా... వెనక కూర్చున్న సుభాష్​ అనే డిగ్రీ విద్యార్థి మృతిచెందాడు.

మృతుడు సుభాష్​ మహబూబ్​నగర్ కొత్తపల్లి నవాబుపేటకు చెందినవాడని ఎస్​ఆర్​నగర్ పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్​లోని నోబుల్ డిగ్రీ కాలేజ్​లో చదువుతూ... ఎన్టీఆర్ నగర్​లో ఉంటున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

ఇవీ చూడండి :'నీది వేరే కులం... నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావ్'

ABOUT THE AUTHOR

...view details