తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆశావర్కర్లకు సరకులు పంపిణీ చేసిన అనిల్​కుమార్​ యాదవ్​

హైదరాబాద్​ గాంధీనగర్​లో ఆశావర్కర్లకు రాష్ట్ర యువజన కాంగ్రెస్​ అధ్యక్షుడు అనిల్​ కుమార్​ యాదవ్​ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆశావర్కర్ల జీతాలను పెంచాలని డిమాండ్​ చేశారు.

By

Published : May 9, 2020, 12:11 AM IST

state youth congress president groceries distribution in hyderabad
ఆశావర్కర్లకు సరకులు పంపిణీ చేసిన అనిల్​కుమార్​ యాదవ్​

ప్రభుత్వం ఆశా కార్మికుల జీతాలను తక్షణమే పెంచాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గుర్రం శంకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని గాంధీనగర్​లో ఆశా వర్కర్లకు అనిల్ కుమార్ యాదవ్ నిత్యావసర సరకులు అందజేశారు.

కొవిడ్​-19 వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి... తక్షణమే వారి జీతాలు రెండింతలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 10 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు


ABOUT THE AUTHOR

...view details