తెలంగాణ

telangana

కడపలో నివర్​ బీభత్సం.. నేల కొరిగిన భారీ వృక్షం

By

Published : Nov 26, 2020, 3:09 PM IST

నివర్ తుపాను ప్రభావంతో కడప జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తుపాను వల్ల నగరంలో ఒక్కసారిగా భారీ వృక్షం నేలకొరిగింది. రాజంపేట పట్టణంలో మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి.

sewage
కడపలో నివర్​ బీభత్సం.. నేల కొరిగిన భారీ వృక్షం

నివర్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి కడప జిల్లా రాజంపేటలో మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద రహదారులు మురుగుమయమయ్యాయి. దీంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలోని వివిధ ప్రాంతాల్లో కల్వర్టులు పొంగుతున్నాయి.


కడపలో ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కడప రైల్వే స్టేషన్​ రోడ్​లో ఉన్న మహా వృక్షం ఒక్కసారిగా నేలకూలింది. ఆ సమయానికి ఒక కారు వెళ్లడంతో ఆ కారుపై చెట్టు కొమ్మ విరిగి పడింది. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కారు దెబ్బతింది. విషయం తెలిసిన అధికారులు విరిగిన చెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు... విద్యుత్తు పునరుద్ధరణ చేస్తున్నారు.

నేల కొరిగిన భారీ వృక్షం

ఇదీ చూడండి:'విద్వేషాలు రెచ్చగొట్టే వారికి నగరంలో చోటులేదు'

ABOUT THE AUTHOR

...view details