నిత్యం శాంతిభద్రతలు, ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో పోలీసులు క్షణం తీరిక లేకుండా ఉంటారు. కరోనా నియంత్రణలో భాగంగా మూడు వారాలుగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. 24 గంటలపాటు షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు... వాహనదారులు, ప్రజలు బయట తిరగకుండా తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.
షిఫ్టులవారీగా విధులు
లాక్డౌన్ ప్రారంభరోజుల్లో పోలీసులు 24 గంటల పాటు విధులు నిర్వహించారు. ఆ మరుసటి రోజు వాళ్లకు విశ్రాంతినిచ్చే వాళ్లు. పోలీసులు అలిసి పోతున్నారనే ఉద్దేశంతో.... ఉన్నతాధికారులు షిఫ్టులవారీగా విధులు కేటాయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 15వేల మంది పోలీసులు నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్న వారికి రోజు 12 గంటల పాటు విధులు కేటాయించారు. పలు చోట్ల తనిఖీ కేంద్రాలల్లో అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే ముందుకు పంపిస్తున్నారు. అకారణంగా బయటికి వచ్చిన వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని జరిమానా విధిస్తున్నారు.
ఎండను లెక్కచేయకుండా..