నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతోన్న సందర్భంగా ఈనెల 26న రాజ్భవన్ ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున అన్ని జిల్లా కేంద్రాల ముందు ధర్నాలు చేపడతామని వెల్లడించాయి.
రైతులు నెలల కొద్ది పోరాడుతోన్నా కేంద్రం పట్టించుకోవడం లేదని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటంలో ఇప్పటికే 500 మంది ప్రాణాలు కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల గురించి కనీస ఆలోచించకుండా మోదీ, దోపిడీదారులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కలిసి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.