రాష్ట్రంలో అనుమానాస్పద స్థితిలో అనేక పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగిన కొంత మంది మిత్రులు తనకు ఇచ్చిన సమాచారాన్నే తాను మీడియాకు చెబుతున్నట్లు వెల్లడించారు.
గత నెల 29న సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతి ఇచ్చిన రోజు నుంచి సీఎం ఎవరికీ కనిపించకుండా పోయారని, ఆ తర్వాత మళ్లీ ఈ నెల 10న సచివాలయం కూల్చివేతను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత అంటే జులై 11న ప్రత్యక్షమయ్యారని చెప్పారు.
వనపర్తి మహారాజ్ సంస్థానం సంపద
ఇన్ని రోజులపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారు... ఎక్కడికి వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించి, సచివాలయ ప్రాంతానికి వెళ్లే దారులన్నీ మూసివేసి వాహనాలను దారిమళ్లించి వేల మంది పోలీసుల పహారాలో సచివాలయాన్ని కూల్చారని అన్నారు.
కూల్చివేత పనులను వీడియో తీశారన్న కారణంగా ఇద్దరు కానిస్టేబుళ్లను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారన్నారు. అంత రహస్యంగా ఎందుకు కూల్చాల్సి వచ్చిందో ఆలోచిస్తే.. "ఆపరేషన్ ఖజానా'' వ్యవహారం బయటపడిందని వెల్లడించారు. హోం సైన్స్ కళాశాల కింద వనపర్తి మహారాజ్ సంస్థానం సంపద దాచిపెట్టినట్లు ఆర్కీయాలజీ డిపార్ట్మెంట్ గతంలోనే చెప్పిందని.. నిజాం కాలంలో జీ బ్లాక్ కింద బంకర్లలో నిధులు దాచి పెట్టేవారని చరిత్ర చెబుతున్నట్లు తెలిపారు.