తెలంగాణ

telangana

By

Published : Sep 29, 2020, 11:00 PM IST

ETV Bharat / state

ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్​

ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కరోనా బారిన పడ్డారు.

AP MINISTER VENUGOPAL
ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్​

ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.

సత్యవేడు ఎమ్మెల్యేకు..

చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం ఆయనకు లక్షణాలు బయటపడగా పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవీచూడండి:ఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు, 35 మరణాలు

ABOUT THE AUTHOR

...view details