తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2021, 10:17 PM IST

ETV Bharat / state

'పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాలి'

సీఎస్​ సోమేశ్​కుమార్​, ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. పదోన్నతుల కోసం మూడేళ్ల సర్వీసు నిబంధనను రెండేళ్లకు తగ్గించాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిపై అధికారులతో చర్చించారు. ఈనెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

minister srinivas goud review meeting with officials
'పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాలి'

పదోన్నతుల కోసం మూడేళ్ల సర్వీసు నిబంధనను రెండేళ్లకు తగ్గించాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిపై సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చర్చించారు. పదోన్నతులకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షించిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వివిధ విజ్ఞప్తులపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతి బుధవారం సమీక్షిస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఎలాంటి జాప్యం లేకుండా చూస్తామని అన్నారు.

ఇదీ చూడండి: రేపు జిల్లా కలెక్టర్లతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details