తెలంగాణ

telangana

By

Published : Sep 6, 2020, 3:56 PM IST

ETV Bharat / state

ఓఎస్డీ కాత్యాయని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్​

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు వద్ద పనిచేసే ఓఎస్డీ కాత్యాయని తల్లి శకుంతల ఇటీవల మరణించారు. ఆదివారం హైదరాబాద్​ ఎస్సార్ నగర్​ పరిధిలోని శ్రీనివాస నగర్​లో ఓఎస్డీ కాత్యాయని ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

minister ktr consoles osd katyayani's family in hyderabad
ఓఎస్డీ కాత్యాయని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్ వద్ద ఓఎస్డీగా పనిచేసే కాత్యాయని తల్లి శకుంతల ఇటీవల కన్నుమూశారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ హైదరాబాద్​ ఎస్​ఆర్ నగర్​ పరిధిలోని శ్రీనివాస నగర్​లో ఉన్న వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు.
ఓఎస్డీ కాత్యాయనికి, ఆమె తండ్రికి ధైర్యం చెప్పారు. ఎల్లప్పుడూ తమ కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. అంతకు ముందు ఓఎస్డీ కాత్యాయని తల్లి గారైన శకుంతల చిత్రపటానికి మంత్రి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇవీ చూడండి: ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి ప్రాణాలు కాపాడాలి: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details