పామూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు... పొదిలి మండలం కంబాలపాడు పంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామం వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
చెట్టుకు ఢీ కొన్న ట్రావెల్ బస్సు.. ప్రయాణికులు సురక్షితం - ప్రకాశం జిల్లాలో బస్సు ప్రమాదం
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు పంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామం వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.

చెట్టుకు ఢీ కొన్న ట్రావెల్ బస్సు.. ప్రయాణికులు సురక్షితం
బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా... ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు.
చెట్టుకు ఢీ కొన్న ట్రావెల్ బస్సు.. ప్రయాణికులు సురక్షితం
ఇదీ చూడండి: రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు