తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2021, 12:22 PM IST

ETV Bharat / state

'ఉద్యోగ విరమణ వయస్సు పెంచటం అన్యాయం'

హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజీ​లో జేఏసీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచటంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఓయూ ఆర్ట్స్ కాలేజ్​లో జేఏసీ విద్యార్థులు ఆందోళన
ఓయూ ఆర్ట్స్ కాలేజ్​లో జేఏసీ విద్యార్థులు ఆందోళన

పెంచిన ఉద్యోగుల వయో పరిమితిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఓయూ జేఏసీ నేత జటంగి సురేశ్​యాదవ్ డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచటంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. హైదరబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులతో మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగ క్యాలెండర్​తోపాటు నోటిఫికేషన్​లు వెంటనే విడుదల చేయాలన్నారు. లేదంటే.. పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:గ్రంథాలయంలో మౌలిక సౌకర్యాల కోసం ధర్నా

ABOUT THE AUTHOR

...view details