గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షుడు మంద భీమ్ రెడ్డి విమర్శించారు. దిల్లీలో నిర్వహిస్తున్న ప్రవాస భారతీయ దివస్ వేడుకలు సంపన్న ఎన్నారైల కోసమేనని ఆరోపించారు.
విస్మరించింది..
దిల్లీలో 16వ ప్రవాసి భారతీయ దివస్ వేడుకల్లో గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు కల్పించకపోవడానికి నిరసనగా.. బషీర్ బాగ్ ప్రెస్క్లబ్లో మాజ్దుర్ ప్రవాసి భారతీయ దివస్ నిర్వహించారు. పేద గల్ఫ్ శ్రామికుల సమస్యలు కేంద్రం విస్మరించిందన్నారు. కరోనాతో విదేశాల్లో జీవనోపాధి కోల్పోయిన వలసదారులు పెద్ద సంఖ్యలో స్వదేశానికి తిరిగొచ్చారని పేర్కొన్నారు.
కార్మికులు పెండింగ్ జీతాలు పొందలేక అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. కనీస వేతనాలను 30 నుంచి 50 శాతం వరకు తగ్గిస్తూ కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. అందువల్ల లక్షలాది మందికి సమాన పనికి సమాన వేతనం అందడం లేదు.
-మంద భీమ్ రెడ్డి, ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షుడు