తెలంగాణ

telangana

ETV Bharat / state

పక్కా ఆధారాలేవి ?

ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్​రెడ్డే అని పోలీసులు చెబుతున్నా ఇప్పటి వరకు పక్కా ఆధారాలు సేకరించలేదు. హత్య జరిగిన తీరుకు.. రాకేష్​రెడ్డి స్టేట్​మెంట్​కు పొంతనలేదని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. దీనికోసం సాంకేతికంగా బలమైన ఆధారాలు సేకరించేపనిలో క్లూస్ టీం నిమగ్నమైంది.

By

Published : Feb 16, 2019, 11:35 AM IST

పక్కా ఆధారాలేవి ?

పక్కా ఆధారాలేవి ?
జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ ఇంకా పూర్తయినట్లు కనిపించడం లేదు. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న దగ్గరి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 40 మందిని విచారించారు. కాల్ డేటా ఆధారంగా కూడా పలువురిని ప్రశ్నించారు.
స్టేట్​మెంట్​కు.. సాక్ష్యాలకు పొంతన ఏది..?
గత ఏడాది అక్టోబర్​లో 80 లక్షలు ఆర్.టి.జి.ఎస్. ద్వారా జయరాం ఖాతాల్లో నగదు పంపించానని రాకేష్ పోలీసులకు చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఒక ఆధారాన్ని కూడా ఇవ్వలేదు. మరోవైపు రాకేష్ రెడ్డి 25 లక్షలు వడ్డీకి ఇస్తానంటూ చెప్పడంతో ఆశపడిన సినీనటుడు సూర్య ప్రకాష్ అలియాస్ డుంబు... ఈ కేసులో ఇరుక్కుపోయాడు. జైరాంను హనీ ట్రాప్ ద్వారా రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చినందుకు.. అతడిని పోలీసులు విచారించారు.
మరోవైపు విచారణ గడువు ముగిసిపోవడంతో... పోలీసులు రాకేశ్ రెడ్డిని కోర్టుకు హాజరు పరిచారు. 3రోజుల విచారణలో లభించిన వివరాలు ఆధారంగా పక్కాగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని పశ్చిమ మండలం డిసిపి శ్రీనివాస్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details