పక్కా ఆధారాలేవి ?
ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్రెడ్డే అని పోలీసులు చెబుతున్నా ఇప్పటి వరకు పక్కా ఆధారాలు సేకరించలేదు. హత్య జరిగిన తీరుకు.. రాకేష్రెడ్డి స్టేట్మెంట్కు పొంతనలేదని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. దీనికోసం సాంకేతికంగా బలమైన ఆధారాలు సేకరించేపనిలో క్లూస్ టీం నిమగ్నమైంది.
పక్కా ఆధారాలేవి ?
గత ఏడాది అక్టోబర్లో 80 లక్షలు ఆర్.టి.జి.ఎస్. ద్వారా జయరాం ఖాతాల్లో నగదు పంపించానని రాకేష్ పోలీసులకు చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఒక ఆధారాన్ని కూడా ఇవ్వలేదు. మరోవైపు రాకేష్ రెడ్డి 25 లక్షలు వడ్డీకి ఇస్తానంటూ చెప్పడంతో ఆశపడిన సినీనటుడు సూర్య ప్రకాష్ అలియాస్ డుంబు... ఈ కేసులో ఇరుక్కుపోయాడు. జైరాంను హనీ ట్రాప్ ద్వారా రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చినందుకు.. అతడిని పోలీసులు విచారించారు.
మరోవైపు విచారణ గడువు ముగిసిపోవడంతో... పోలీసులు రాకేశ్ రెడ్డిని కోర్టుకు హాజరు పరిచారు. 3రోజుల విచారణలో లభించిన వివరాలు ఆధారంగా పక్కాగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని పశ్చిమ మండలం డిసిపి శ్రీనివాస్ తెలిపారు.