తెలంగాణలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్తోపాటు అన్ని జోన్ల డీసీపీలతో ఆయన సమీక్ష నిర్వహించారు.
'కరోనాపై పోరులో తెలంగాణ పోలీసులకు కేంద్రం కితాబు'
కరోనాపై పోరులో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడంలో రాష్ట్ర పోలీసుల పనితీరు ప్రశంసనీయమని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర పోలీసుల సేవలకు కేంద్ర బృందం సైతం కితాబిచ్చిందని తెలిపారు.
కరోనాపై పోరులో తెలంగాణ పోలీసులకు కేంద్రం కితాబు
విధుల్లో పోలీసులపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదన్నారు. రంజాన్ ఉపవాసం ఉండేవారు నిత్యావసరాల కోసం వస్తే కొంత సానుకూలంగా వ్వవహరించాలని పోలీసులకు సూచించారు. ప్రతి డీసీపీ రోజుకు రెండు పోలీసు స్టేషన్లు తనిఖీ చేయాలని సూచించారు.
ఇదీ చూడండి:చరవాణి ఉందా.. చెంతనే వైద్యమిక!
TAGGED:
home minister review meeting