తెలంగాణ

telangana

ETV Bharat / state

గుండె జబ్బులపై అప్రమత్తంగా ఉండాలి: గవర్నర్​

ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయని.. ఆ పరిస్థితులపై ప్రజలను వైద్యులు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 5వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

By

Published : Feb 15, 2020, 8:49 PM IST

governor
గుండె జబ్బులపై అప్రమత్తంగా ఉండాలి: గవర్నర్​

హైదరాబాద్​లోని ఓ హోటల్లో కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 5వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయని.. ఆ పరిస్థితులపై ప్రజలను వైద్యులు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యానికయ్యే ఖర్చును చాలా వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు.

గుండె జబ్బులపై అప్రమత్తంగా ఉండాలి: గవర్నర్​

ఇదీ చూడండి:ప్లాస్టిక్​ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్​ అవగాహన

ABOUT THE AUTHOR

...view details