తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేట్​ శక్తులకు లొంగుతున్న ప్రభుత్వాలు

ప్రభుత్వాలన్ని కార్పొరేట్​ సంస్థల ధనసంపత్తి ముందు లొంగిపోతున్నాయని  తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. కార్పొరేట్​ అధ్యాపకులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ..ఈ నెల 27న చేపట్టనున్న బంద్​కు ఆయన మద్దతునిచ్చారు.

By

Published : Aug 19, 2019, 5:54 PM IST

కార్పొరేట్​ శక్తులకు లొంగుతున్న ప్రభుత్వాలు

కార్పొరేట్​ కళాశాల్లో విద్యా బోధన ఆధునికమని..నడిపేతీరేమో మధ్యయుగాల మాదిరిగా ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. అధ్యాపకులకు కనీస వేతనం ఇవ్వకుండా ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ సోమాజిగూడలోని ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా కార్పొరేట్​ శక్తుల తీరు మారకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఒకే పేరుతో పదుల సంఖ్యలో కళాశాలలు నడపడం సరికాదన్నారు. కార్పొరేట్​ అధ్యాపకులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ..ఈ నెల 27న చేపట్టనున్న బంద్​కు మద్దతునిచ్చారు. వారి సమస్యలు పరిష్కరించే వరకు కలసి పోరాడుతానని స్పష్టం చేశారు.

కార్పొరేట్​ శక్తులకు లొంగుతున్న ప్రభుత్వాలు
ఇదీ చూడండి: 'కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘన'

ABOUT THE AUTHOR

...view details