తెలంగాణ

telangana

By

Published : Aug 1, 2019, 6:50 PM IST

ETV Bharat / state

​​​​​​​ జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యం... పనుల్లో ఆలస్యం..

జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యం.. వ్యాపారుల పాలిట శాపంగా మారింది. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి మధ్యలో వదిలేయడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

​​​​​​​ జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యం... పనుల్లో ఆలస్యం

హైదరాబాద్​ చాంద్రాయణగుట్ట నుంచి ఉప్పుగూడ వెళ్లే రహదారిలోని తాళ్లకుంటలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న చిన్న మురికి కాల్వను జీహెచ్​ఎంసీ అధికారులు వెడల్పు చేసే పనులు రెండు నెలల క్రితం ప్రారంభించారు. 15 రోజుల నుంచి పనులు ఆగిపోవడం వల్ల అటువైపు వెళ్లే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ ఉన్న వ్యాపారస్థులు రెండు నెలల నుంచి నాలా పనుల వల్ల తమ వ్యాపారం మందకొడిగా సాగుతోందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి త్వరగా నిర్మాణ పనులు జరిగేలా చూడాలని కోరుతున్నారు.

​​​​​​​ జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యం... పనుల్లో ఆలస్యం

ABOUT THE AUTHOR

...view details