హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ (నుమాయిష్) పేరిట కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ వైబ్సైట్లను తయారు చేసి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. నుమాయిష్ హెచ్టీఎంఎల్, నుమాయిష్ ఆన్లైన్ డాట్కాం పేర్లతో రెండు నకిలీ వెబ్సైట్లు చలామణీ అవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ డాట్కాం... పేరిట అధికారిక వెబ్సైట్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
నుమాయిష్ పేరిట నకిలీ వైబ్సైట్లు
ఈ మధ్య కాలంలో నకిలీ వెబ్ సైట్లు, నకిలీ ముఠాలు ఎక్కువైపోతున్నారు. ఈ సైబర్ దొంగలు ఎగ్జిబిషన్ను కూడా వదలడం లేదు. తాజాగా నుమాయిష్పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వైబ్సైట్లతో ఎగ్జిబిషన్పై వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
దీనిలో రోజువారీ కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. అసలు వెబ్సైట్ను పోలిన విధంగా ఉండటం వల్ల నుమాయిష్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నెటిజన్లు నుమాయిష్ పేరుతో అంతర్జాలంలో శోధించగానే ఈ రెండు నకిలీ వెబ్సైట్లు వస్తున్నట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో భాజపా బృందం భేటీ