పౌల్ట్రీ విస్తరణ పనుల కోసం షెడ్లు వేసుకున్నామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మీరు ఏది చెబితే అది చేసే అధికారులు మీ చేతుల్లో ఉన్నారని వెల్లడించారు. కొంత భాగం అసైన్డ్ భూముల్లో పోయిందని తెలిపారు. భూమికి బదులు భూమి ఇస్తామన్నామన్నారు. కార్మికుల కోసం షెడ్లు వేస్తే 66 ఎకరాలు కబ్జా చేసినట్లు నివేదిక ఇచ్చారని చెప్పారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో విచారణ జరపాలని కోరారు. కలెక్టర్ నివేదిక తమకు అందలేదని.. తమ వివరణ కూడా అడగలేదన్నారు. వ్యక్తులు ఉంటారు పోతారు.. పార్టీలు ఉంటాయి పోతాయి.. వ్యవస్థలు మాత్రం శాశ్వతమని వ్యాఖ్యానించారు.
ఇదేనా మీ సంస్కృతి?
ప్రభుత్వం నుంచి ఐదు పైసలు సాయం తీసుకోలేదు.. ఐదు కుంటల భూమి పొందలేదు.. పౌల్ట్రీకి నాలా అవసరం లేదు.. దానిపై కూడా నోటీసు ఇచ్చారు. కేసీఆర్ గారు ఇదేనా మీ సంస్కృతి?.. మీరు వెయ్యేళ్లు ఉంటారా?: అరెస్టులకు.. కేసులకు ఈటల భయపడే వ్యక్తి కాదు. నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు. ఎంత పెద్ద కేసులైనా పెట్టండి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. మీ శిష్యరికంలో నేర్చుకున్న ప్రజలనే నమ్ముకుంటాను. అసైన్డ్ భూముల్లో కంపెనీలు రోడ్లు వేయలేదా?. మీకు వ్యవసాయ క్షేత్రం ఉంది.. అందులో రోడ్లు వేయలేదా? ప్రలోభపెట్టి కొందరితో మాట్లాడించారు.. స్వయంగా సర్పంచ్ మాట మార్చారు. మీ నిజాయితీ, ధర్మానికి ఇదే నిదర్శనం. -ఈటల రాజేందర్
నా కోసం వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు