తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతీ స్త్రీకి విటమిన్స్, కాల్షియం, ప్రొటీన్లు కావాలి' - 'ప్రతీ స్త్రీకి విటమిన్స్, కాల్షియం, ప్రొటీన్లు కావాలి'

సికింద్రాబాద్​లో అపోలో ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా క్రెడిల్ కార్యక్రమం చేపట్టారు. బాలికలకు పోషకాహారం అందకపోతే రుతుక్రమం సమయంలో అధిక రక్త స్రావానికి గురవుతారు. ఫలితంగా శరీరం అలసటకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటారని డా. జయశ్రీ అన్నారు.

నారీమణులు పోషకాహారం తీసుకోవాలి : డా. జయశ్రీ
నారీమణులు పోషకాహారం తీసుకోవాలి : డా. జయశ్రీ

By

Published : Jan 26, 2020, 3:58 AM IST

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్​లో అపోలో... క్రెడిల్ కార్యక్రమం నిర్వహించింది. బాలికలకు సరైన పోషకాహారం అందడం లేదని గైనకాలజిస్ట్ డా.జయశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. రుతుక్రమ సమయంలో స్త్రీలల్లో రక్తహీనత పెరగుదల, కోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. సరైన అవగాహన లేకే మూత్రనాళాలు ఇన్ఫెక్షన్​కు గురవుతున్నారని గుర్తు చేశారు.

అవగాహన లేకుంటే అంతే సంగతి...

కొందరికి సమస్యపై అవగాహన లేక అధిక రక్తస్రావంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలకు విటమిన్స్, కాల్షియం, ప్రొటీన్లు అందించాలని సూచించారు. పోషకాహారం సక్రమంగా తీసుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా జన్మిస్తారని ఈ సందర్భంగా వివరించారు.

నారీమణులు పోషకాహారం తీసుకోవాలి : డా. జయశ్రీ

ఇవీ చూడండి : అందరికీ ఉపాధి, ఉద్యోగమే లక్ష్యం: కేంద్రమంత్రి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details