కొవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ విధిగా నిబంధనలు పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు. క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు తీసుకోవాలని సజ్జనార్ సూచించారు. వైరస్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని కోరారు. సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్తో కలిసి.. కొవిడ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.