తెలంగాణ

telangana

Covaxin: సెప్టెంబర్​ నుంచి పిల్లలకు కొవాగ్జిన్​..!

By

Published : Jun 26, 2021, 2:10 PM IST

కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పిల్లలపై థర్డ్​ వేవ్​ ప్రభావం చూపుతుందనే వైద్యాధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో వారి రక్షణకు చర్యలు చేపట్టింది. పిల్లలకు వ్యాక్సిన్​ ఇచ్చేందుకు కేంద్రం, టీకా కంపెనీలు ప్రక్రియను వేగవంతం చేశాయి. భారత్​ బయోటెక్​ ఇప్పటికే కొవాగ్జిన్​ ట్రయల్స్​ ప్రారంభించింది.

covaxin to children
పిల్లలకు కొవాగ్జిన్​ టీకా

కొవిడ్ థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే ఊహాగానాలు, హెచ్చరికల నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం, వ్యాక్సిన్ కంపెనీలు కసరత్తును వేగవంతం చేశాయి. భారత్ బయోటెక్​కు చెందిన కొవాగ్జిన్.. పిల్లలపై ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్​ను ప్రారంభించగా వాటి ఫలితాలు ఈ ఏడాది సెప్టెంబర్ లోపు వెలువడే అవకాశాలున్నాయి.

దిల్లీలోని ఎయిమ్స్, బిహార్​ పట్నాలోని చెలువంబ ఆస్పత్రి, మహారాష్ట్ర నాగ్​పూర్​లోని మెడిట్రినా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, యూపీ కాన్పూర్​లోని ప్రకార్ హాస్పిటల్​లో కొవాగ్జిన్​ ట్రయల్స్ జరుగుతున్నాయి. త్వరలో హైదరాబాద్​లోని ప్రనమ్ ఆస్పత్రిలోనూ పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ జరగబోతున్నాయి.

ఫలితాల ఆధారంగా

పిల్లలపై వ్యాక్సిన్ ఫేజ్​-2, ఫేజ్​-3 ట్రయల్స్ ఫలితాలు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వెలువడుతాయి. ఆ ఫలితాల ఆధారంగా అప్పటి నుంచే పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. కొవాగ్జిన్​తో పాటు.. ఫైజర్, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్లను సైతం పిల్లలకు టీకా వేసేందుకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్రం ప్రయత్నాలను వేగవంతం చేసింది.

ఇదీ చదవండి:MINISTER KTR: పక్కనే దవాఖానా, ఫంక్షన్ హాల్ కట్టిస్తాం..: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details