ప్రగతి భవన్కు ర్యాలీ
మొదట ప్రగతిభవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని యోచించిన నేతలు వ్యూహాం మార్చారు. భేటీ ముగియగానే అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో ఆందోళనకు దిగారు.చట్టసభల సభ్యులను ఎంతకు కొనుగోలు చేస్తున్నారో సీఎం చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఆడుతున్న రాజకీయ క్రీడ జుగుప్సాకరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తనను శాసనమండలి పక్ష నేత పదవి నుంచి తీసేసేందుకు తమ పార్టీ ఎమ్మెల్సీలను తెరాసలోకి తీసుకున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని కాంగ్రెస్లోనే ఉండి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తానని ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్పష్టం చేశారు. పోడు భూముల సమస్యలు ఉన్న ప్రతి చోట కూడా పార్టీ గెలిచిందని ఎమ్మెల్యే హరిప్రియనాయక్ అన్నారు.