తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్​రెడ్డి.. అమిత్​షాకు లేఖ రాయాల్సింది:వీహెచ్​ - అమిత్​షాకు.. రేవంత్​రెడ్డి లేఖ రాయాల్సింది:వీహెచ్​

ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంపీ రేవంత్​రెడ్డి లేఖ రాయడంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ స్పందించారు. కేసీఆర్​కు బదులుగా కేంద్ర హోంమంత్రి అమిత్​షాకు ఫిర్యాదు చేస్తే కేటీఆర్​ ఆస్తులపై విచారణకు ఆదేశించే అవకాశం ఉండేదన్నారు.

v hanumanta rao
రేవంత్​రెడ్డి.. అమిత్​షాకు లేఖ రాయాల్సింది:వీహెచ్​

By

Published : Jan 19, 2020, 8:18 PM IST

మంత్రి కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి లేఖ రాయడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు స్పందించారు. కేసీఆర్​కు బదులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షాకు లేఖ రాయాల్సిందని అభిప్రాయపడ్డారు.

అమిత్​షాకు లేఖరాస్తే 2 ఉపయోగాలు..

ఏ ముఖ్యమంత్రి కూడా తన కుమారుడిపై విచారణ చేయించే సాహసం చేయరన్నారు. అమిత్​షాకు ఫిర్యాదు చేస్తే రెండు ఉపయోగాలున్నాయని తెలిపారు. భాజపా, తెరాసల మధ్య ఉన్న రహస్య అజెండా కూడా బయడపడే అవకాశం ఉందన్నారు. విచారణకు ఆదేశించకపోతే రెండు పార్టీల మధ్య అవగాహన ఉందన్న విషయం స్పష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రికి రేవంత్​ ఫిర్యాదు చేయనట్లయితే.. తానే చేస్తాయని వీహెచ్​ స్పష్టం చేశారు.

రేవంత్​రెడ్డి.. అమిత్​షాకు లేఖ రాయాల్సింది:వీహెచ్​

ఇవీచూడండి: 'మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details