తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2020, 4:05 AM IST

ETV Bharat / state

'మీరు ఇళ్లకే పరిమితమవ్వండి'

హైదరాబాద్​ ఆల్విన్ కాలనీ డివిజన్​లో కరోనా వైరస్ నియంత్రణకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు స్థానిక కార్పొరేటర్​ దొడ్ల వెంకటేష్ గౌడ్. మీరు ఇళ్లకే పరిమితం అవ్వండి... మీ సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.

మీరు ఇళ్లకే పరిమితమవ్వండి
మీరు ఇళ్లకే పరిమితమవ్వండి

లాక్​​డౌన్ అమలులో ఉన్నందున ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ.... ఇళ్లకే పరిమితమవ్వాలని కూకట్​పల్లి ఆల్విన్​ కాలనీ కార్పొరేటర్ దొడ్డి వెంకటేష్ గౌడ్ ప్రజలను కోరారు. ఆల్విన్ కాలనీ డివిజన్​లోని శిల్ప బృందావనం గృహ సముదాయం, ఎల్లమ్మ బండలోని ఖాజానగర్ తదితర బస్తీలలో కరోనా వైరస్ నియంత్రణకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. సామాజిక దూరం, కనీస శుభ్రత పాటించాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకు పరిమితమై... కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు.

డివిజన్​లోని అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లపై రసాయనాలతో స్ప్రే చేయిస్తున్నామని... ఎక్కడైనా కెమికల్స్​ పిచికారి చేయనట్లు అనిపిస్తే తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మీరు ఇళ్లకే పరిమితమవ్వండి

ఇదీ చూడండి:జన్‌ధన్‌’ నగదు విత్‌డ్రా ఈ తేదీల్లోనే..

ABOUT THE AUTHOR

...view details