తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2020, 4:47 PM IST

ETV Bharat / state

'ఒలంపిక్స్​లో భారత్ అత్యధిక పతకాలు సాధిస్తుంది'

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తోన్న బాక్సింగ్‌ పోటీలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు.

Central minister kishan reddy on Olympic games
'ఒలంపిక్స్​లో భారత్ అత్యధిక పతకాలు సాధిస్తుంది'

రాబోయే ఒలంపిక్స్‌లో భారత్‌ అత్యధిక పతకాలు సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌ రెడ్డి. అన్ని రంగాల్లో ముందున్న దేశం క్రీడల్లోనూ.. ముందుండేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తోన్న బాక్సింగ్‌ పోటీలను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఫిట్‌ ఇండియాలో భాగంగా ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా ఉన్నప్పుడే వారి వారి వృత్తుల్లో రాణించగలరని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం బీజేవైెం క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఎల్బీ స్టేడియంలో బాక్సింగ్‌ పోటీలు

ఇవీ చూడండి: 'విచారణ కోసం నిబంధనల రూపకల్పన చేస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details