తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజాధనం కాజేశారని... ముగ్గురిపై కేసు నమోదు - Case filed against these three in illegal money release case

జగన్ అక్రమాస్తుల కేసులో తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ నిధులు కాజేశారని విశ్రాంత ఐఏఎస్ అధికారి సీవీఎస్​కే శర్మపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ సీఎస్ పీకే మహంతి, పీవీ రమేశ్​లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సీవీఎస్​కే శర్మ, మాజీ సీఎస్ పీకే మహంతి, పీవీ రమేశ్​లపై కేసు నమోదు

By

Published : Nov 1, 2019, 5:23 AM IST

Updated : Nov 1, 2019, 8:55 AM IST

సీవీఎస్​కే శర్మ, మాజీ సీఎస్ పీకే మహంతి, పీవీ రమేశ్​లపై కేసు నమోదు
జగన్ అక్రమాస్తుల కేసులో న్యాయ సలహాల ఖర్చుల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి సీవీఎస్​కే శర్మపై కేసు నమోదైంది. తప్పుడు రశీదులు సృష్టించి బిల్లులు కాజేశారని హైదరాబాద్ పోలీసులు​ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో సహకరించారని అప్పటి సీఎస్ పీకే మహంతి, ఏపీ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేశ్​పై కూడా కేసు నమోదు చేశారు. జేడీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ రమణ దాఖలు చేసిన ఫిర్యాదులో నాంపల్లి కోర్టు జారీ చేసిన ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

జగన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యంలో... న్యాయ సలహాల నిమిత్తం నిధులివ్వాలని 2014లో కొందరు ఐఏఎస్ అధికారులు కోరారు. దీనికి అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. సీవీఎస్​కే శర్మ... న్యాయవాదికి ఫీజు చెల్లించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రజాధనం కాజేశారని ఆరోపిస్తూ ఏవీ రమణ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో 7 లక్షల 56 వేల రూపాయల బిల్లులను మంజూరు చేయడంలో పీకే మహంతి, పీవీ రమేశ్ ప్రమేయం కూడా ఉందని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు... సీవీఎస్​కే శర్మ, పీకే మహంతి, పీవీ రమేశ్​లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ముగ్గురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Nov 1, 2019, 8:55 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details