తెలంగాణ

telangana

జీహెచ్​ఎంసీ సిబ్బందికి అల్పాహారం అందజేత

By

Published : Apr 17, 2020, 1:54 PM IST

Updated : Apr 17, 2020, 2:09 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తోన్న జీహెచ్​ఎంసీ ఎంటమాలజీ సిబ్బందికి హైదరాబాద్ తార్నాక డివిజన్ కార్పొరేటర్ సరస్వతి తనవంతు సాయం చేస్తున్నారు. దాతల సాయంతో ప్రతిరోజు ఉదయం వారికి అల్పాహారం అందిస్తున్నారు.

GHMC
GHMC

కరోనా వంటి ఆపత్కర సమయంలో విధులు నిర్వహిస్తోన్న వారికి రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారని హైదరాబాద్ తార్నాక డివిజన్ కార్పొరేటర్ పాలకొండ సరస్వతి హరి అన్నారు. 150 మంది జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బందికి దాతల సాయంతో ప్రతిరోజు అల్పాహారాన్ని అందజేస్తున్నారు.

ఈ ఆపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సామాజిక సృహతో పనిచేయాలని కోరారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Last Updated : Apr 17, 2020, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details