తెలంగాణ

telangana

'తెరాస నేతలు బయటకు వెళ్లకండి.. జనం కొట్టేలా ఉన్నారు'

By

Published : Nov 20, 2020, 7:13 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ తీరుపై మాజీ ఎంపీ, భాజపా నేత వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస ఓడిపోతుందని జోస్యం చెప్పారు.

BJP leader Vivek fires on KCR
'తెరాస నేతలు బయటకు వెళ్లకండి.. జనం కొట్టేలా ఉన్నారు'

కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి రాష్ట్ర ఖజానాను స్వాహా చేశారని భాజపా నేత వివేక్ విమర్శించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక పార్లమెంట్​లో 7 స్థానాలు, ఇప్పుడు దుబ్బాక కూడా ఓడిపోయారని... త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడినాక కేటీఆర్ పరిస్థితి ఆలోచించుకోవాలని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ బిజీగా ఉన్నారని కేటీఆర్ చెప్తున్నారని.. ప్రజల సమస్యలు పట్టకుండా ఫామ్ హౌస్​లో కూర్చుని సెక్రటేరియట్ ఎలా కట్టాలని కేసీఆర్ బిజీగా ఉన్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఆదుకోవడం పక్కన పెట్టి వరద సహాయం ఆపమని భాజపా ఈసీకి చెప్పిందని విమర్శలు చేస్తున్నారన్న ఆయన... నగర ప్రజలు తెరాస నేతలను బయటకు వెళ్తే కొట్టేలా ఉన్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details