స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు వచ్చిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాల్తోడ్ ప్రాంతానికి చెందిన కరణ్ సింగ్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరితో కలిసి హైటక్సిటీలో గ్యాస్ ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. సొంతూరుకు వెళ్లేందుకు గత నెల 26న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. దానాపూర్ రైలు ఎక్కాల్సి ఉండగా కరణ్సింగ్ కనిపించలేదు. మిగిలిన ఇద్దరూ కరణ్ సింగ్ కోసం వెతికి కనిపించకపోయేసరికి సొంతూరుకి వెళ్లిపోయారు. రైలు రద్దీ ఎక్కవగా ఉండడం వల్లనే కరణ్సింగ్ ఎక్కలేక పోయి ఉండొచ్చని భావించినట్లు తన సహచరులు తెలిపారు. ఎన్నిరోజులైనా ఇంటికి చేరకపోవడం వల్ల ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ప్రయోజనం లేదు. విషయాన్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటికి బయలుదేరిన యువకుడు అదృశ్యం
స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చిన మధ్యప్రదేశ్కు చెందిన యువకుడు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యువకుడు అదృశ్యం