తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటికి బయలుదేరిన యువకుడు అదృశ్యం

స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్​కు వచ్చిన మధ్యప్రదేశ్​కు చెందిన యువకుడు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Dec 18, 2019, 12:29 PM IST

a youmg man missed at secendrabad railway station
సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో యువకుడు అదృశ్యం

స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్​కు వచ్చిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో జరిగింది. మధ్యప్రదేశ్​ రాష్ట్రం షాల్తోడ్ ప్రాంతానికి చెందిన కరణ్ సింగ్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరితో కలిసి హైటక్​సిటీలో గ్యాస్​ ఫిట్టర్​గా పనిచేస్తున్నాడు. సొంతూరుకు వెళ్లేందుకు గత నెల 26న సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​కు వచ్చాడు. దానాపూర్ రైలు ఎక్కాల్సి ఉండగా కరణ్​సింగ్​ కనిపించలేదు. మిగిలిన ఇద్దరూ కరణ్​ సింగ్​ కోసం వెతికి కనిపించకపోయేసరికి సొంతూరుకి వెళ్లిపోయారు. రైలు రద్దీ ఎక్కవగా ఉండడం వల్లనే కరణ్​సింగ్​ ఎక్కలేక పోయి ఉండొచ్చని భావించినట్లు తన సహచరులు తెలిపారు. ఎన్నిరోజులైనా ఇంటికి చేరకపోవడం వల్ల ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ప్రయోజనం లేదు. విషయాన్ని సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లోని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో యువకుడు అదృశ్యం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details