రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు తీవ్రంగా స్పందించారు. జేపీ నడ్డా వ్యాఖ్యలను తప్పుబడుతూ మంత్రి హరీష్రావు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులు, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాతో తలపడుతున్న వైద్యుల కృషి సైనికులతో సమానమని ప్రధాని మోదీ తెలిపిన విషయాన్ని మంత్రి హరీశ్ గుర్తు చేశారు.
అనుచితం కాదంటూనే రాజకీయాలా ..
దేశ రక్షణ విషయంలో ప్రభుత్వాలను విమర్శించడం అనుచితం కాదని జేపీ చెప్పిన విషయాన్ని ఊటంకిస్తూ మంత్రి హరీశ్ నిలదీశారు. అలాంటప్పుడు మానవాళి మనుగడకే సవాలుగా మారిన కరోనా విషయంలో రాజకీయాలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కరోనాపై విమర్శలు చేయడం అంటే దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లడటమేనని వ్యాఖ్యానించారు.
విమర్శించడం రాజనీతి అవుతుందా ?