మేడ్చల్ జిల్లా కేపీహెచ్బీలో కరోనా అనుమానితులకు హోటల్ రూమ్లు కేటాయించడం వల్ల స్థానికులు ఆందోళనకు దిగారు. సర్దార్ పటేల్ నగర్లో గల ఓయో రూమ్స్లో సుమారు యాభై మంది కరోనా అనుమానితులకు రూములు కేటాయించినట్లు ఆరోపించారు. పోలీసులు, స్థానిక కార్పొరేటర్ సంఘటనా స్థలానికి చేరుకొని హోటల్ యాజమాన్యంతో చర్చలు నిర్వహించారు.
కేపీహెచ్బీలోని ఓ హోటల్లో 50 మంది కరోనా అనుమానితులు!
హైదరాబాద్లో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ పలువురు నగరవాసులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాంటిది కరోనా అనుమానితులకు కేపీహెచ్బీలో హోటల్ రూములు కేటాయించటంతో స్థానికులు ఆందోళనకు దిగారు.
ఓయో రూమ్స్లో 50 మంది కరోనా అనుమానితులు..!
హోటల్ రూంలో ఉన్నవారిని మరోచోటికి తరలించేందుకు హోటల్ యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. హోటల్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రూమ్లో ఉన్న వారు బయటకు రాకుండా అలాగే కొత్తవారు లోనికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.