తెలంగాణ

telangana

గోదావరి నదిలో ఆర్టీసీ కార్మికులు జలదీక్ష

By

Published : Oct 23, 2019, 9:15 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మారి... ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చాలని కోరుకుంటూ భద్రాచలంలోని కార్మికులు జలదీక్ష చేపట్టారు.

గోదావరి నదిలో ఆర్టీసీ కార్మికులు జలదీక్ష

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసీ ఉద్యోగులు జల దీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా గోదావరి నదిలో దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోదారమ్మ తల్లి సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మారి... తమ సమస్యలు పరిష్కరించాలని కోరుకున్నారు. సుమారు గంటసేపు గోదావరి నీటిలో ఉండి నిరసన వ్యక్తం చేశారు. దీక్షలో ఆర్టీసీ ఉద్యోగులతో పాటు వామపక్షాల నాయకులు, మహిళా కండక్టర్​లు పాల్గొన్నారు.

గోదావరి నదిలో ఆర్టీసీ కార్మికులు జలదీక్ష

ABOUT THE AUTHOR

...view details