భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసీ ఉద్యోగులు జల దీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా గోదావరి నదిలో దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోదారమ్మ తల్లి సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మారి... తమ సమస్యలు పరిష్కరించాలని కోరుకున్నారు. సుమారు గంటసేపు గోదావరి నీటిలో ఉండి నిరసన వ్యక్తం చేశారు. దీక్షలో ఆర్టీసీ ఉద్యోగులతో పాటు వామపక్షాల నాయకులు, మహిళా కండక్టర్లు పాల్గొన్నారు.
TAGGED:
ఆర్టీసీ ఉద్యోగులు జల దీక్ష