భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని భూగర్భ ఉపరితల గనులు కరోనా ప్రభావంతో మూతబడ్డాయి. నిత్యం కార్మికులతో కలకలలాడే గనుల ప్రాంతాలలో నిర్మానుష్యంగా మారాయి. బొగ్గులు తరలించే బోగీల ప్రాంతాల్లో జనతా కర్ఫ్యూ ప్రభావంతో ఎటువంటి పనులు జరగడం లేదు. సింగరేణి సంస్థ సెలవు ప్రకటించడం వల్ల బందును తలపించేలా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
ఇల్లందు పట్టణంలో జనతా కర్ఫ్యూ కు అనూహ్య స్పందన లభిస్తుంది. ఉదయం నుంచి ప్రధాన రహదారులు, పెట్రోల్ బంక్ బస్టాండ్ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. రోడ్డు పైకి వస్తున్న ఒకరిద్దరు వాహనదారులను పోలీసులు రెవెన్యూ ఉద్యోగులు కౌన్సిలింగ్ చేస్తూ ఇళ్లలోకి పంపిస్తున్నారు.