భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో.. జామాయిల్ రైతులు భాజపా నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్ చేస్తూ సారపాక భద్రాచలం పేపర్ లిమిటెడ్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు.
ఐటీసీ.. జామాయిల్ కర్రకు టన్నుకు రూ. 3వేలను మాత్రమే చెల్లించి రైతులను మోసం చేస్తోందని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. 2018లో కంపెనీ తీసుకొచ్చిన జీవో ప్రకారం.. రూ. 4500ను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.