భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ మండలాల్లోని వందలాది ఎకరాల్లో మామిడితోటలో కాయలు నేలరాలాయి. నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి రైతులకు సుమారు రూ.రెండు కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.
గాలివానకు నాటు పొగాకు రైతులు కూడా నష్టాన్ని చవిచూశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేయగా.. ఇప్పటికే 1,200 ఎకరాలకు పైగా పొగాకును కోశారు. అది తడిసి ముద్దయిపోయింది.