బ్లాక్ ఫంగస్తో చనిపోయిన వారికి అంతిమ గౌరవం దక్కడం లేదు. చివరికి రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు సైతం ఒంటరిగా వదిలేస్తున్నారు. అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగింది. కృష్ణసాగర్ పంచాయితీ ఎస్టీ కాలనీకి చెందిన భూక్య రవీందర్ బ్లాక్ ఫంగస్తో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భయపడిన బంధువులు అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు.
బంధుత్వం భయపడింది.. మానవత్వం ముందుకొచ్చింది..
కరోనా, బ్లాక్ ఫంగస్తో మృతిచెందితే రక్తసంబంధీకులు సైతం అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకురాని తరుణంలో మేమున్నామంటూ కొందరు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. పెద్దదిక్కు లేని కుటుంబాల విజ్ఞప్తి మేరకు బట్ట మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు అంత్యక్రియలు నిర్వహించి అందరి అభినందనలు అందుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో చోటు చేసుకుంది.
బట్ట మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్
విషయం తెలుసుకున్న బట్ట మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు బట్ట విజయ్ గాంధీ దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్తో మృతిచెందిన వ్యక్తిపై వైరస్ 30 నిమిషాలు మాత్రమే ఉంటుందని... తర్వాత వైరస్ ఉండదని విజయ్ గాంధీ తెలిపారు. ఎవరైనా కరోనాతో మరణిస్తే కుటుంబ సభ్యులు జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి:SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్ అవసరమా ?