హరితహారం పేరుతో పోడుభూముల ఆక్రమణను నిలిపివేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వాటికి పట్టాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
'పోడుభూముల ఆక్రమణలను అడ్డుకోవాలి'
హరితహారం పేరుతో పోడుభూముల ఆక్రమణను నిలిపి వేయాలని అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. వాటికి పట్టాలివ్వాలని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో ర్యాలీ నిర్వహించారు.
అఖిలపక్ష పార్టీల నేతల ర్యాలి
వివిధ గ్రామాల రైతులతో గుండాల మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్లు, ఆవునూరి మధు, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.
ఇదీ చూడండి:యాసంగి కోసం రైతుబంధు సాయం పంపిణీ ప్రారంభం