తెలంగాణ

telangana

By

Published : Sep 30, 2019, 1:26 PM IST

ETV Bharat / state

ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే దీక్షలు

రాష్ట్ర కమిటీ సమ్మె చేపట్టాలని నిర్ణయించినందుకుగాను ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట కార్మికులు రిలే దీక్షలకు శ్రీకారం చుట్టారు.

ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే దీక్షలు

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట కార్మికులు రిలే దీక్షలకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి రాష్ట్ర కమిటీ సమ్మె చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకే ఈ రోజు ఆదిలాబాద్​లో ధర్నా ప్రారంభించారు. ఐకాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో అన్ని సంఘాలు పాల్గొన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఐకాస జిల్లా కన్వీనర్ చారి తెలిపారు.

ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే దీక్షలు

ABOUT THE AUTHOR

...view details