తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణవాయువు అందక వ్యాధిగ్రస్తురాలు మృతి - Empty Oxygen Cylinder Patient Dead at Adilabad district RIMS Hospital

వైద్యో నారాయణ హరి అంటారు... దేవుడు ఇచ్చిన జన్మకు మళ్లీ పునర్జన్మనివ్వగల గొప్ప సౌభాగ్యం వైద్యులకే ఉంటుంది. అందుకే వైద్యులను దేవుడితో పోలుస్తారు. అలాంటి వైద్యుల నిర్లక్ష్య వైఖరి వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. మొన్నటికి మొన్న నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇవాళ ఆదిలాబాద్​లో రిమ్స్​కు అత్యవసరస్థితిలో ఆసుపత్రికి వచ్చిన వ్యాధిగ్రస్థురాలికి వైద్యం చేయకపోగా.. అంబులెన్స్‌లో ఖాళీ ఆక్సిజన్‌ సిలిండర్​తో హైదరాబాద్‌కు రిఫర్‌ చేసిన ఘటన ఆమె మృతికి కారణమైంది.

empty-oxygen-cylinder-patient-dead-at-adilabad-district-rims-hospital
ప్రాణవాయువు అందక వ్యాధిగ్రస్తురాలు మృతి

By

Published : Jan 4, 2020, 4:10 AM IST

Updated : Jan 4, 2020, 6:28 AM IST

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం యాపల్‌గూడ గ్రామానికి చెందిన మార్చెట్టి లక్ష్మి అనారోగ్యానికి గురికావటం వల్ల బంధువులు రిమ్స్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా పెద్దాసుపత్రికి తరలించాలంటూ హైదరాబాద్‌ రిఫర్‌ చేశారు. పైగా అంబులెన్స్‌లో తరలించాలని సలహా ఇచ్చారు. భయభ్రాంతులకు గురైన ఆమె బంధువులు వెంటనే అంబులెన్స్‌ను మాట్లాడుకొన్నారు.

ఖాళీ సిలిండర్​కు రూ.4వేలా?

అంబులెన్స్​లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవటం వల్ల బాధిత కుటుంబ సభ్యులు రిమ్స్‌ ఆసుపత్రిలోనే సిబ్బందికి రూ.4వేలు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేశారు. వారికి ఆ సిబ్బంది ఖాళీ సిలిండర్​ను ఇచ్చారు. ఇదేం తెలియని బంధువులు లక్ష్మిని హైదరాబాద్‌ తరలిస్తుండగా... మార్గమధ్యలో ఆమెకు శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది ఎదురైంది. వెంటనే ఆమెను సమీపంలో ఉన్న నేరడిగొండ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ అది ఖాళీ ఆక్సిజన్‌ సిలిండరని తేలింది. అక్కడ కూడా ఆక్సిజన్‌ సిలిండర్ అందుబాటులో లేకపోవటం వల్ల నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా లక్ష్మి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన తల్లి మృతిచెందిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు.

ఇంతజరిగిన రిమ్స్‌ అధికారులుగానీ, సిబ్బందిగాని అసలు పట్టించుకోకపోవడం అక్కడ వ్యవస్థీకృతమైన నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యాధిగ్రస్థురాలికి ఖాళీ సిలిండర్‌ను ఇచ్చిన సిబ్బందిపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్​ చేస్తున్నారు.

ప్రాణవాయువు అందక వ్యాధిగ్రస్తురాలు మృతి

ఇవీచూడండి: చిన్న నీటివనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష

Last Updated : Jan 4, 2020, 6:28 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details