తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2019, 5:26 AM IST

ETV Bharat / sports

డిసెంబరులో మేరీ-నిఖత్​ల 'మెగా' ఫైట్​

ఒలింపిక్​ క్వాలిఫయింగ్​ ఈవెంట్​కు పంపే విషయమై భారత మహిళా బాక్సర్లు మేరీకోమ్-నిఖత్ జరీన్​ల మధ్య డిసెంబరు చివరి వారంలో ట్రయల్స్ నిర్వహించనున్నారు.

డిసెంబరులో మేరీ-నిఖత్​ల 'మెగా' ఫైట్​

భారత మహిళా స్టార్‌ బాక్సర్లు మేరీకోమ్‌-నిఖత్‌ జరీన్‌ల మధ్య మాటల యుద్ధం గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ కోసం చైనాలో జరిగే క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌కు మేరీ(51 కిలోల విభాగం)ని పంపాలని భారతీయ బాక్సింగ్‌ ఫెడరేషన్‌(బీఎఫ్‌ఐ) నిర్ణయించింది.

ఈ విషయాన్ని తెలంగాణ బాక్సర్ నిఖత్‌ వ్యతిరేకించింది. తానూ ఇదే విభాగంలో ఉన్నానని, తమ మధ్య ఒలింపిక్స్‌ సెలక్షన్‌ ట్రయల్‌ నిర్వహించాలంటూ బీఎఫ్​ఐని కోరింది. ఈ విషయంపై స్పందించిన ఫెడరేషన్.. వారి మధ్య ట్రయల్స్​కు రంగం సిద్ధం చేసింది. అధికారిక ప్రకటన రాకపోయినా, డిసెంబరు చివరి వారంలో వీరు తలపడే అవకాశముంది.

భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్

డిసెంబర్‌ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆలిండియా బాక్సింగ్‌ లీగ్‌(ఐబీఎల్‌) జరుగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే మేరీకోమ్‌-జరీన్‌ల మెగా ఫైట్‌ ట్రయల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో గెలిచిన బాక్సర్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు.

ABOUT THE AUTHOR

...view details