తెలంగాణ

telangana

By

Published : Oct 13, 2019, 2:37 PM IST

ETV Bharat / sports

ఫైనల్లో మంజురాణికి నిరాశ.. రజతంతో సరి

ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్స్ ​షిప్​లో మంజురాణి వెండి పతకం సాధించింది. స్వర్ణంపై ఆశలు రేపిన ఈ క్రీడాకారిణి.. ఆదివారం జరిగిన ఫైనల్లో ఓటమిపాలైంది. ప్రత్యర్థి ఎకాతెరినా(రష్యా) చేతిలో 4-1 తేడాతో ఓడింది.

బాక్సింగ్​ ఛాంపియన్​షిప్:​ మంజురాణి ఖాతాలో వెండి

భారత బాక్సర్‌ మంజురాణి ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్స్‌షిప్​లో వెండిపతకంతో సరిపెట్టుకుంది. రష్యాలోని ఉలాన్‌ ఉదె వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఓటమిపాలైంది. 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఈ హరియాణా క్రీడాకారిణి.. రష్యా ప్లేయర్​ ఎకతెరినా చేతిలో 4-1 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో పరాజయం చెంది రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా తొలిసారి ప్రపంచ ఛాంపియన్స్ షిప్​లో పతకం గెలిచింది.

2001లో మేరీకోమ్‌ తర్వాత మళ్లీ ఫైనల్స్‌లో ప్రవేశించిన తొలి భారత మహిళా బాక్సర్‌గా నిలిచింది మంజు. ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్‌జ మెమొరియల్‌ బాక్సింగ్‌ పోటీల్లో ఆమె రజత పతకం కైవసం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details