Surajit Sengupta Footballer: ఫుట్బాల్ దిగ్గజం, భారత మాజీ ఆటగాడు సురజిత్ సేన్గుప్తా (71) గురువారం కన్నుమూశారు. కొవిడ్ బారిన పడిన ఆయన కోల్కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారత జట్టుకు సురజిత్ మిడ్ ఫీల్డర్గా సేవలు అందించారు.
సురజిత్ మృతిపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. "ఓ స్టార్ ఫుట్బాలర్ను ఈరోజు కోల్పోయాం. ఫుట్బాల్ అభిమానులు ఆరాధించే మేటి జాతీయ ఆటగాడు సురజిత్. ఆయన ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారు. ఆయనకు నా నివాళి." అని మమత ట్వీట్ చేశారు.
కొవిడ్ పాజిటివ్గా తేలడంతో సురజిత్ జనవరి 23న ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల గత వారం నుంచి వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడం వల్ల గురువారం తుది శ్వాస విడిచారు.