తెలంగాణ

telangana

ETV Bharat / sports

ర్యాంకింగ్స్: ఐదులోనే కోహ్లీ- శ్రీలంక కెప్టెన్ కాస్త పైకి

టెస్టు ర్యాంకింగ్స్​లో కోహ్లీ, ఐదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక సారథి కరుణరత్నె తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 11వ ర్యాంకుకు చేరుకున్నాడు. టాప్​-10లో టీమ్​ఇండియా నుంచి రోహిత్​, పంత్ కూడా​ చోటు దక్కించుకున్నారు.

By

Published : May 5, 2021, 4:15 PM IST

kohli
కోహ్లీ, దిముత్​ కరుణ్​రత్నె

అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ).. తాజా టెస్టు ర్యాంకింగ్స్​ను బుధవారం ప్రకటించింది. బ్యాట్స్​మెన్​ విభాగంలో టాప్​-10 ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. శ్రీలంక కెప్టెన్ దిముత్​ కరుణ​రత్నె తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 712 పాయింట్లతో 11వ ర్యాంకులో నిలిచాడు. బంగ్లాదేశ్​పై రెండో టెస్టు గెలిచిన తర్వాత ర్యాంకింగ్స్​లో మెరుగుపడ్డాడు. టీమ్​ఇండియా సారథి కోహ్లీ ఐదో స్థానంలోనే కొనసాగుతుండగా.. పంత్(747) ఆరో స్థానానికి , రోహిత్ ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు.​​ న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్స్​న్​ అగ్రస్థానాన్ని కాపాడుకోగా, స్మిత్​, లబుషేన్​, రూట్..​ రెండు, మూడు నాలుగు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

బ్యాటింగ్​

బౌలింగ్​ విభాగంలో ప్యాట్ కమిన్స్​(908 పాయింట్లు) తొలి స్థానాన్ని, రవిచంద్రన్​ అశ్విన్​(850) రెండో ర్యాంకును పదిలపరుచుకున్నారు.

బౌలంగ్​

ఆల్​రౌండర్​ విభాగంలో జేసన్​ హోల్డర్​(423 పాయింట్లు) టాప్​లో ఉండగా, స్టోక్స్​(393), జడేజా(386), అశ్విన్​(353) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

ఆల్​రౌండర్​

ABOUT THE AUTHOR

...view details