జాతీయ కాంట్రాక్ట్ విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ), ఆ దేశ ఆటగాళ్ల మధ్య వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలో టీమ్ఇండియాతో జరగబోయే సిరీస్లో సంతకాలు చేయని ప్లేయర్స్ను పక్కనపెట్టాలని లంక బోర్డు భావిస్తోంది! ప్రత్యామ్నయంగా వారి స్థానంలో ఒప్పందానికి(కాంట్రాక్ట్) అంగీకారం తెలిపిన ఆటగాళ్లను మాత్రమే ఆడించాలని ప్లాన్ చేస్తోంది.
"39మంది ఆటగాళ్లు ఒప్పందానికి అంగీకారం తెలిపారు. మేం తొలి ప్రాధాన్యత ఇచ్చిన ఆటగాళ్లు ఎవరైతే సంతకాలు చేయరో వారిని సిరీస్కు ఎంపిక చేయం. సంతకాలు చేసిన వారితోనే రెండో(కొత్త) జట్టును తయారుచేసి ఆడిస్తాం. ఇప్పటికే వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంగ్లాండ్తో మూడో(చివరి) వన్డే పూర్తవ్వగానే భారత్తో సిరీస్లకు జట్టును ప్రకటిస్తాం" అని శ్రీలంక క్రికెట్ సెలక్టర్స్ ఛైర్మన్ ప్రమోద్య విక్రమసింఘె చెప్పినట్లు అక్కడి వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి.