ఐపీఎల్లో అత్యంత ఆకర్షణీయ ఫ్రాంచైజీల్లో ముంబయి ఇండియన్స్ ఒకటి. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో ఒక్కసారే గెలిచి, అభిమానులను నిరాశపరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పుడీ రెండు జట్లు, అబుదాబి వేదికగా గురువారం తలపడనున్నాయి. తమపై అంచనాలు పెట్టుకున్న అభిమానుల కల నెరవేర్చాలని ముంబయి.. ఎలాగైనా ఫైనల్కు చేరాలనే తపనతో పంజాబ్ పట్టుదలతో ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
వ్యూహం ఫలించేనా?
చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసిన ముంబయి.. ఆ తర్వాత కోల్కతాపై ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్లో చివరివరకు పోరాడి.. సూపర్ ఓవర్లో బెంగళూరు జట్టుకు తలవంచక తప్పలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య లాంటి స్టార్ బ్యాట్స్మెన్తో జట్టు బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో బుమ్రా, బౌల్ట్, ప్యాటిన్సన్, రాహుల్ చాహర్ల అండదండలున్నాయి. మరి పంజాబ్తో మ్యాచ్లో రోహిత్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.
గెలుపు దక్కేనా?